Tuesday, May 21, 2024

ప్రభుత పాఠశాలలు, కళశాలలకూ ఉచిత విద్యుత్

  • ప్రభుత పాఠశాలలు, కళశాలలకూ ఉచిత విద్యుత్
  • మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం
  • ఎంసీహెచ్ఆర్ డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది పూర్తిగా అబ్బద్దమన్నారు.

విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు.
ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదన్నారు. మీ ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందన్నారు. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. అయితే ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాకుండానిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి మూర్థత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలేనని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల్లో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరుపుతున్నామన్నారు. దీని కోసమే ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

వారి కుటుంబంలోనే రక్తం చిందలేదు

రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేవలం కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ…
తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారన్నారు. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారన్నారు. పైగా తెలంగాణ బాపు అని తనకు తానే కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలన్నారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదన్నారు.

రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందన్నారు. గత ప్రభుత్వంలో గాఢీ తప్పిన పాలనను సరిదిద్ధుకుంటూ వస్తున్నామన్నారు. ఆర్ధిక లోటు ఇబ్బంది పెడుతున్నప్పటికీ మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేశామన్నారు. అయినప్పటికీ దీనిపై తాము ప్రచారం చేసుకోలేదన్నారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు సాగుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.

అల్లాటప్పగా అధికారంలోకి రాలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమన్నారు. ఏ రాజకీయ పార్టీ దయాదాక్షిణ్యం అధికారంలోకి రాలేదని….ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే…..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కొనసాగాలే పాలన అందిస్తామన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని ఆరు నెలలు, మూడు నెలల్లో కూల్చుతామని కొందరు నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న కేసీఆర్ కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా…ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలన్నారు.

95శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే… ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు.శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందేని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశం నిర్వహించి మంచి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

కోదండరాంను మండలికి పంపుతాం

గవర్నర్ తో మాట్లాడి కోదండరాం ను శాసన మండలికి పంపుతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి మరింత గౌరవం వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular