-
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళా దారుణ హత్య
-
రోడ్డు సమీపంలోని ఓ చెత్త డబ్బాలో మృతదేహం
-
ఆస్ట్రేలియాలోని విక్టోరియా బక్లీలో ఘటన
-
ఆమె భర్తే హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలోని మిర్కావే పాయింట్ కుక్ లో తెలంగాణకు చెందిన చైతన్య మాధగాని అలియస్ శ్వేత ఆమె భర్త అశోక్ రాజ్ వరికుప్పలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో శ్వేత ను ఆమె భర్త అశోక్ హత్యచేసి బక్లీలోని రోడ్డుపక్కనున్న చెత్తడబ్బాలో మృతదేహాన్ని పడేశాడు. శ్వేత మృతిపై కేసు నమోదు చేసుకున్న విక్టోరియా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే శ్వేతను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు, కానీ ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. భార్య శ్వేతను హత్య చేసిన అనంతరం అశోక్ రాజ్ మృతదేహాన్ని చెత్తడబ్బాలో దాచి పెట్టాడు. తర్వాత కుమారుడితో కలిసి హైదరాబాద్ చేరుకుని ఏఎస్ రావు నగర్ లో ఉంటున్న అత్తగారింట్లో విడిచిపెట్టాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్ళి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శ్వేత మృతదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తోన్నారు.