కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్
లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం సిఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అమిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, సోమవారం ఉదయం అమిత్రెడ్డి నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరీ, డిసిసి అధ్యక్షుడు రోహిన్రెడ్డి వెళ్లారు. ఈ మేరకు వారు అమిత్రెడ్డిని కాంగ్రెస్ చేరాలని ఆహ్వానించగా వారి ఆహ్వానం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.