Saturday, May 18, 2024

నేను ఊరుకోను..! ఫోన్ ట్యాపింగ్ లో నా ప్రమేయం లేదు

  • నేను ఊరుకోను..!
  • ఫోన్ ట్యాపింగ్ లో నా ప్రమేయం లేదు
  • త్వరలోనే నోటీసీలు పంపిస్తా
  • మాజీ మంత్రి కేటీఆర్

టీఎస్​, న్యూస్​:ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తన ప్రమేయం లేకపోయినా…. ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి త్వరలో కోర్టు ద్వారా నోటీసులు పంపనున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన చెప్పారు. నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో నా పరువుకు నష్టం కలిగించిన ఒక మంత్రితోపాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కేకే మహేందర్‌కు నోటీసులు పంపిస్తానని వెల్లడించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలని. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన సంస్థలకు కూడా నోటీసులు ఇస్తామని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular