టీఎస్, న్యూస్:ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్ అధికారులపై వేటు పడింది. రాజకీయ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐపీఎస్లపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తరములేశ్వర్ పై బదిలీ వేటు పడింది. బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలుయ జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఈసీ సూచించింది. దీనిపై కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.