Sunday, May 19, 2024

పిరమైన ప్రధాని గారికి..! కేటీఆర్​ సెటైర్​

పిరమైన ప్రధాని గారు.. ఈ దేశం కోసం ఏదైనా విజ‌న్ ఉంటే చెప్పండి.. కానీ ద‌య‌చేసి స‌మాజంలో డివిజ‌న్ మాత్రం సృష్టించ‌కండి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రానికి వ‌స్తున్న నేప‌థ్యంలో యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ట్విట్ట‌ర్ వేదిక‌గా కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు.

ప్ర‌ధానిగా తెలంగాణ ప్ర‌ధాన హామీల‌ను ఎందుకు మ‌రిచారో చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ద‌య‌చేసి ప‌విత్ర‌మైన ఈ నేల‌పై విషం చిమ్మ‌కుండా, ద‌శాబ్దాకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడ‌గాల‌ని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి అని సూచించారు. రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు.. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా అని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular