Sunday, May 19, 2024

లీగల్ నోటీసులతో కెటిఆర్ బెదిరిస్తున్నారు

  •  న్యాయవ్యవస్థపై, అడ్మినిస్ట్రేన్‌పై కెటిఆర్‌కు అవగాహన ఉందా
  • మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు లీగల్ నోటీసులు పంపి కెటిఆర్ బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కెటిఆర్ తనతో పాటు మరో ఇద్దరికీ లీగల్ నోటీసులు పంపారని ఆయన అన్నారు. అసలు ఆయనకు న్యాయవ్యవస్థపై, అడ్మినిస్ట్రేన్‌పై అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. బాధితుడిగా తాను ఫిర్యాదు చేశానని, ఆధారాలు ఉన్నందుకే పోలీసు అధికారులను విచారిస్తున్నారని ఆయన తెలిపారు. విచారణ చేయాలని అడుగుతుంటే పరువు తీశామని కెటిఆర్ అంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను కెటిఆర్ స్థానంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్‌లో తన పాత్ర లేదని అధికారులకు లేఖ రాస్తానని ఆయన చెప్పారు. గత ప్రభుత్వానిది అడ్డిమారిగుడ్డి దెబ్బ పాలన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌పై వరుస కథనాలు వస్తున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. దానిపై తాము కూడా తమ ఫోన్ ట్యాప్ అయినట్లు డిజిపికి ఫిర్యాదు చేశామన్నారు.

Also Read: నేడు జరగనున్న ఉప్పల్ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే కెటిఆర్‌కు ఏం తెలుసునని, బ్లాక్ మెయిల్, బెదిరింపులు తప్ప అని తీవ్రస్థాయిలో యెన్నం ధ్వజమెత్తారు. తనకు లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఆస్కారం ఏముందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కెటిఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ జరుగుతున్నప్పుడు లీగల్ నోటీసులు ఇస్తారా అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్‌లో ఒకరు, గెస్ట్ హౌస్‌లో ఇంకొకరు ఉండి, పాలన సాగించారని, అడ్డిమారి గుడ్డి దెబ్బల పాలన సాగినట్లుగా వారి పాలన ఉందని యెన్నం ఎద్దేవా చేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కథనాలు పోలీసు ఆఫీసర్లను జైల్లో ఎందుకు పెడతారు ఆధారాలు ఉంటేనే కదా అంటూ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన కెటిఆర్‌కు ఏం తెలుసునని ఆయన దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగం చేసినందుకు 39 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసలు లీగల్ నోటీసులు సిఎం రేవంత్ రెడ్డి కెటిఆర్‌కు ఇవ్వాలని ఎందుకంటే ఢిల్లీకి కప్పం కడుతున్నారన్న ఆరోపణలు చేసినందుకు అని హెచ్చరించారు. ఇతర పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు సొంత ఇంటి వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయలేదా అంటూ ఎమ్మెల్యే యెన్నం ప్రశ్నించారు. దీనికి కూడా నోటీసులు ఇస్తే ఇచ్చేయ్ అంటూ హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాజ వ్యతిరేక శక్తులపై చేస్తారని, కానీ, వ్యక్తుల ఫోన్లపై కాదన్నారు. హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కథనాలు వస్తున్నాయని వాటి సంగతి ఏంటని కెటిఆర్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular