Tuesday, May 7, 2024

నేడు జరగనున్న ఉప్పల్ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

ఐపిఎల్ -2024 లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్డేడియం దీనికి వేదిక కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టిఎస్ ఆర్టీసి గుడ్ న్యూస్ చెప్పింది. ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లుగా ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు.

ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు ఎండి సూచించారు. ఐపిఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్ మార్చి 27న ముంబైతో జరగ్గా ఏప్రిల్ 5వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్, మే 8న లక్నో సూపర్ జెయింట్స్, మే 16న గుజరాత్ టైటాన్స్, మే 19వ తేదీన పంజాబ్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular