-
నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి
-
సివిల్ సప్లై శాఖలో భారీ అవినీతి
-
బీజేపీఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి
సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టారు. దీనికి సంధించి 18 ప్రశ్నలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ప ఎట్టారు. కస్టం మిల్లింగ్ ఇవ్వని మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సివిల్ సప్లై శాఖలో లెక్కకు మిక్కిలి అక్రమాలు, అవినీతి జరుగుతుంటే ఓ రైతు బిడ్డగా తాను సహించలేక ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే… సంబంధిత శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాలపై మంత్రి ఉత్తమ్ తో బహిరంగ చర్చకు తాను సిద్దం అని ఏలేటీ సవాల్ చేశారు. ప్రతిపక్ష బీజేపీ శాసనసభా పక్ష నేతగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ సర్కారు పెద్దల బెదిరింపులకు భయపడేది లేదన్నారు.