Wednesday, May 1, 2024

రేపటి నుంచే నామినేషన్ల పర్వం

సర్వేలన్నీ బంద్

టీఎస్​, న్యూస్​: తెలుగు రాష్ట్రాల్లో గురువారం నుంచి ఎన్నికల్లో ప్రధాన అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్​, తెలంగాణ పార్లమెంట్​ ఎన్నికలకు రేపు (ఏప్రిల్‌ 18) నోటిషికేషన్‌ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. ఇదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.. అదే విధంగా, నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది.. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించ నున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణియంచారు.

26న నామినేషన్ల పరిశీలించి..

29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. సర్వేలు బంద్‌ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వే లకు పుల్‌ స్టాప్‌ పడ్డట్టయింది.. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు, ప్రజలకు వెల్లడించ కూడదు. ప్రీ-పోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

సర్వేలు బంద్‌

రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వే లకు పుల్‌ స్టాప్‌ పడ్డట్టయింది.. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు, ప్రజలకు వెల్లడించ కూడదు. ప్రీ-పోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular