Monday, May 20, 2024

రైతుల‌కు రేవంత్ శుభ‌వార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగానే రైతులకు పంటపెట్టుబడి సాయం కింద రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధితాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రేజరీలో ఉన్న రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతుభరోసా కార్యక్రమం గురించి విధివిధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular