Thursday, May 9, 2024

జానారెడ్డి కేసీఆర్‌ను అర్థ‌రాత్రి ఎందుకు క‌లిశారు?

# పరామర్శల వెనుక రాజకీయ వ్యూహంపై అనుమానాలు
# సోమాజిగూడ యశోదకు లీడర్ల క్యూ
# చర్చనీయాంశంగా కాంగ్రెస్ నేతల పరామర్శ
# రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు

రాష్ట్రంలో సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్​ను పరామర్శించే వారి జాబితా ఒక్కరోజులోనే పెరిగిపోయింది. సొంత పార్టీ నేతల తాకిడి ఎలా ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ నేతలు, మంత్రులు మాత్రం యశోద ఆస్పత్రికి క్యూ కట్టారు. కానీ, ఈ నెల 9న రాత్రి కాంగ్రెస్​ కీలక నేత జానారెడ్డి వెళ్లి కేసీఆర్​ను పరామర్శించడం హాట్​ టాపిక్​గా మారింది. జానారెడ్డి వెళ్లి కేసీఆర్​ను పరామర్శించి వచ్చిన తర్వాత మరునాడు ఉదయమే సీఎం రేవంత్​రెడ్డి హుటాహుటినా పరామర్శకు వెళ్లారు. సీఎం వెళ్లేందుకు ముందుగానే మంత్రి పొన్నం ప్రభాకర్​ కూడా వెళ్లి వచ్చారు. ఇక, సీఎం రేవంత్​ వెళ్లి వచ్చిన తర్వాత కాంగ్రెస్​ నేతల తాకిడి పెరిగింది. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు, ఇతర నేతలు, సినీ ప్రముఖులు కూడా క్యూ కట్టారు. కాంగ్రెస్​ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పరామర్శించి వచ్చారు.

జానారెడ్డి వెళ్తే..!
కేసీఆర్​కాలు గాయంతో యశోద ఆస్పత్రిలో చేరిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి ఆరా తీశారు. ఆ తర్వాత ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. రెండు రోజుల పాటు సైలెంట్​గా ఉన్న నేతలు.. ఒక్కసారిగా యశోద చుట్టూ లైన్​ కట్టారు. కానీ, ఈ నెల 9న రాత్రి కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి వెళ్లి కేసీఆర్​ను పరామర్శించారు. ఇక్కడే ఆసలు కథ మొదలైంది. నిజానికి, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. మెజార్టీ మాత్రం చాలా తక్కువ. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఇదే సమయంలోకాంగ్రెస్​ అంటేనే వివాదాల కూపం. దీనికితోడు సీఎం కుర్చీపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అందులో ముందు వరుసలో జానారెడ్డి ఉన్నారు. ఇటీవల సీఎం ఎవరనే నిర్ణయం, మంత్రివర్గ కూర్పు వంటి విషయాల్లో జానారెడ్డి సైలెంట్​గా ఉన్నారు. కనీస సమాచారం కూడా లేదని అలిగారు కూడా. ఇలాంటి సమయంలో ఆయన ఒంటరిగా వెళ్లి కేసీఆర్​ను కలువడం.. అటు ఏఐసీసీ వర్గాల్లో కూడా అనుమానాలు వచ్చాయి.

జానా దగ్గరకు రేవంత్​
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అత్యవసరంగా జానారెడ్డి దగ్గరకు పరుగు పెట్టారు. దీనిలో ఏఐసీసీ నుంచి కీలకమైన ఆదేశాలు వచ్చాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. జానారెడ్డి అసంతృప్తిగా ఉన్నాడని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన కేసీఆర్​ దగ్గరకు వెళ్లడం కూడా రాజకీయంగా కలకలం సృష్టించింది. దీంతో రేవంత్​రెడ్డి హుటాహుటినా జానారెడ్డి దగ్గరకు వెళ్లి కలిసి వచ్చారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular