- ఒక ఐజీ.. మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు
- మరో ఐదుగురు అదనపు ఎస్పీలు
టీఎస్, న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగస్వాములైన అధికారుల పాత్రను బయటకు తీస్తున్నారు. కొంతమంది అధికారులు కలిసి ఎస్ఐబీని బంధీ చేసినట్లుగా సిట్ పోలీసులు గుర్తించారు. సీఎంఓ నుంచి భరోసా ఉండటంతో.. ఇంటలీజెన్సీ బ్యూరో విచ్చలవిడిగా ప్రవర్తించింది. కేవలం ఒకే వర్గానికి చెందిన పోలీస్ అధికారులతో ఏర్పాటైన టీం.. రాష్ట్రంలోని లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఎస్ఐబీని రిటైర్డ్ ఐజీ ప్రభాకర్రావుతో పాటు ఒక మాజీ డీఐజీ ముందుండి నడిపించినట్లు తేలింది. వీరితో పాటుగా ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు కలిసి ఎస్ఐబీని కంట్రోల్ చేసినట్లు తేలింది. వీరిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రణీత్రావుతో పాటుగా అడిషనల్ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే.
రిటైరైన తర్వాతే అసలు కథ
ప్రభుత్వంలో కీలకమైన ఇంటలీజెన్సీ విభాగాన్ని పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారుల చేతుల్లో పెట్టారు. కొంతమందిని.. ఒకే సామాజివర్గానికి చెందిన వారిని ఎంపిక చేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు.. వారికి నిఘా విభాగాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుపుగుతున్న సిట్ బృందం దీనిపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. ఐజీ హోదాలో పదవీ విరమణ పొందిన ప్రభాకర్రావు చీఫ్గా వ్యవహరించగా, మరో డీఐజీ కూడా అదేస్థాయిలో పని చేశారు. ఇక, ప్రణీత్రావు నేతృత్వంలో ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు కూడా రిటరైన తర్వాత ఎస్ఐబీలోనే ఉన్నారు. వీరంతా ప్రణీత్రావు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ నిర్వహించారు. ప్రణీత్రావుకు మరో ఐదుగురు ఇన్స్పెక్టర్లను అప్పగించారు. ఇలా మొత్తంగా 38 మందితో ప్రణీత్ టీం SIB Logger Room ఎస్ఐబీ లాగర్ రూంను నడిపించింది. ఈ వ్యవహారంలో సహకరించిన వారందరినీ సిట్ పోలీసులు విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నారు.
బ్రెజిల్కు స్పెషల్ టీం Phone tampering
కాగా, ఫోన్ ట్యాంపరింగ్కోసం కొనుగోలు చేసిన డివైజ్లపై విచారణ చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయగా.. దర్యాప్తు చేస్తున్న సిట్లో ఒక ప్రత్యేక బృందం బ్రెజిల్కు వెళ్లేందుకు రెడీ అవుతున్నది. అక్కడ పరికరాలు కొనుగోలు, అనుమతి పత్రాలు, ఎలా తీసుకువచ్చారు, అందుకు ఎవరెవరు సహకరించారనే వివరాలపై ప్రత్యేక బృందం కూపీ లాగనున్నది.