- ఈటల రాజేందర్ గెలుస్తాడు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు
టీఎస్, న్యూస్: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ సీనియర్ నేత స్వయంగా ఒప్పుకున్నారు. మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజెందర్ గెలుస్తాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజెందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. అడిగి మరీ ఈటలతో.. మల్లారెడ్డి ఫోటో దిగారు. తప్పక విజయం సాధిస్తారని దీవించారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు.
నువ్వే గెలుస్తున్నవ్ అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజిగిరిలో మొత్తం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.