Tuesday, May 7, 2024

అన్నా నువ్వే గెలుస్తున్నావ్…

  • ఈటల రాజేందర్​ గెలుస్తాడు
  • బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు

టీఎస్​, న్యూస్​: మల్కాజిగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ ఓటమిని ఆ పార్టీ సీనియర్​ నేత స్వయంగా ఒప్పుకున్నారు. మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజెందర్ గెలుస్తాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజెందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. అడిగి మరీ ఈటలతో.. మల్లారెడ్డి ఫోటో దిగారు. తప్పక విజయం సాధిస్తారని దీవించారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు.

నువ్వే గెలుస్తున్నవ్ అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజిగిరిలో మొత్తం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular