Tuesday, May 7, 2024

దొంగలతో దోస్తీ.. మద్యం పార్టీలతో చిందులు..

డీఐని సస్పెండ్​చేసిన సీపీ

టీఎస్​, న్యూస్​: నేరగాళ్లతో దోస్తీ చేసి, వారికి అండగా నిలవడమే కాకుండా, బర్త్‌డే పార్టీలో వారితో కలిసి చిందులేసిన మంగళ్‌హట్‌ పోలీస్ స్టేషన్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ రెడ్డిపై వేటు పడింది. నేరస్థులతో కలిసి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి సస్పెండ్‌ చేశారు. గత ఏడాది కాలంగా మంగళ్‌హాట్‌ పోలీస్టేషన్‌లో డీఐగా పనిచేస్తున్న మహేందర్‌ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

ఇతడు గ్యాంబ్లింగ్‌ హౌస్‌ (పేకాట స్థావరాల) నిర్వాహకులతో చెట్టాపట్టాలు, గంజాయి విక్రేతలు, సట్టా నిర్వాహకులు, రౌడీషీటర్లు, బెల్ట్‌ షాపుల నిర్వాహకులతో దోస్తీ పెట్టుకున్నాడు. మహేందర్‌రెడ్డి గంజాయి విక్రేతలతో స్నేహంగా ఉంటూ వారికి రక్షణగా ఉన్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వీటికి బలం చేకూరేలా సదరు డీఐ మహేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు, పేకాట స్థావరంలో జరుపున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపిన అనంతరం డీఐ మహేందర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular