Sunday, May 19, 2024

సీబీఐ విచారణను ఆపండి

  • సీబీఐ విచారణను ఆపండి
  • రౌస్ అవెన్యూ కోర్టు ను ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

టీఎస్​, న్యూస్​ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఉత్తర్వులను ప్రస్తావించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించ లేదన్నారు. సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టుకు కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కవిత పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఇవాళ చెప్పాలన్నారు..

స‌మ‌యం కోరిన సీబీఐ

అయితే రిప్లే పిటిషన్ దాఖలుకు సీబీఐ తరపున న్యాయవాది టైమ్ కోరారు.. దీంతో, 10వ తేదీన వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగించాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే వాదనలు విన్నాకే.. ఆదేశాలు ఇస్తామని చెప్పారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి చ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలులో ఉన్నారు. జైలు లోనే ఆమెను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు.. ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు.. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించవచ్చని సూచించింది.. జైలు లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకు వెళ్ళేందుకు సీబీఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు.. దీంతో ఆమె కోర్టకు వెళ్లారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular