Saturday, May 18, 2024

అధికారం పోయిందన్న కోపంతో కెసిఆర్ అబద్ధాలు చెబుతున్నారు

  • అధికారం పోయిందన్న కోపంతో కెసిఆర్ అబద్ధాలు చెబుతున్నారు
  • టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే కరువు పరిస్థితులు మళ్లీ వచ్చాయని మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. పంట వాడిపోవడానికి, ఎండిపోవడానికి కూడా తేడా తెలియని పెద్ద రైతు మన కెసిఆర్ అన్నారు. జనగామ జిల్లాలో 1 లక్షా 80 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులోని లక్ష ఎకరాల వరిపంట వారం రోజుల్లో కోయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడా కరెంట్ పోవడం కారణంగా గుంట భూమి కూడా ఎండిపోలేదన్నారు. వాస్తవ పరిస్థితులు ఇట్లా ఉంటే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కెసిఆర్ పొలంబాట అని కొత్త కథ మొదలు పెట్టారన్నారు.

అధికారం లేకపోయేసరికి కెసిఆర్‌కు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని సుధాకర్ గౌడ్ ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన సంగతి ఇంకా రైతులు మరిచిపోలేదన్నారు. జనగామలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, పంటలెండిపోతే, కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని కెసిఆర్ తెలుసుకోవాలన్నారు. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కెసిఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఆ రైతుల వివరాలు ఇవ్వాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular