Tuesday, May 21, 2024

కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి టాలీవుడ్ నటుడు వెంకటేష్ సిద్ధం

  • మే 7వ తేదీన ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డి తరపున వెంకీ ప్రచారం

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేష్ సిద్ధమవుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపుకోసం వెంకటేష్ ప్రచారానికి సిద్ధమయ్యారు. హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ వెంకీ ప్రచారంతో మరింత కలిసి వస్తుందని రఘురాం రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. దీంతో రఘురాంరెడ్డి పిలుపు మేరకు వియ్యంకుడి గెలుపు కోసం హీరో రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే మే 7వ తేదీన ఖమ్మంలో వెంకటేష్‌తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం ఖమ్మం పార్లమెంట్ వరకు మాత్రమే వెంకీ ప్రచారం ఉంటుంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం రఘురాం రెడ్డి వియ్యంకుడు అవుతారు. ఆయన కూడా వియ్యంకుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మరి వీరి ప్రచారం అభ్యర్థి రఘురాం రెడ్డికి ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular