నియమించిన కాంగ్రెస్ అధిష్టానం
పది పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ (అసెంబ్లీ ఉప ఎన్నిక) స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. వివిధ రాష్ట్రాల నేతలతో కూడిన ప్రత్యేక పరిశీలకుల జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియమాకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
మెదక్ నియోజకవర్గానికి కొడికున్నిల్ సురేష్, జహీరాబాద్ నియోజకవర్గానికి రాజ్ మోహన్ ఉన్నితాన్, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి జి.సి. చంద్రశేఖర్, మల్కాజిగిరి నియోజకవర్గానికి ఎస్.జ్యోతిమణి, చేవెళ్ల నియోజకవర్గానికి హైబీ ఈడెన్, ఆదిలాబాద్ నియోజకవర్గానికి షఫీ పరంబిల్, నిజామాబాద్ నియోజకవర్గానికి ఎన్.ఎస్ బోసురాజు, మంతర్ గౌడ, నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి పి.వి. మోహన్, సికింద్రాబాద్ నియోజకవర్గానికి రిజ్వాన్ అర్షద్, వరంగల్ నియోజకవర్గానికి రవీంద్ర దాల్వీ, కంటోన్మెంట్ నియోజకవర్గానికి పి.విశ్వనాథన్లను నియమించారు.