Tuesday, May 21, 2024

టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని నిజానికి ఏదైనా అనిశ్చిత పరిస్థితి ఉందా అంటే అది బిఆర్‌ఎస్, కెసిఆర్ కుటుంబంలో ఉందని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కెసిఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయంలో అనిశ్చితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, రాజకీయంగా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లడం వేరని, మోసం చేసి దగా చేసి జైలుకు వెళ్లడం వేరు సంగతి అన్నది కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు.

రాష్ట్రంలో సుస్థిరమైన బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కెసిఆర్ తెలుసుకోవాలన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఆ ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన ఏ రకమైన కలలు కంటున్నారో అర్థం అవుతోందని ఆయనకు సానుభూతి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తానే తెచ్చానని ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చి ఎన్ని ఎకరాల భూములు తన వారికి, ఆంధ్రవారికి కట్టబెట్టారో కెసిఆర్ నిజ స్వరూపం ప్రజలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular