Sunday, May 19, 2024

రిజర్వేషన్లకు ఇంకేం గ్యారంటీ కావాలి

  • రిజర్వేషన్లకు ఇంకేం గ్యారంటీ కావాలి
  • మోడీ చెప్పారంటే అదే ఫైనల్
  • కాంగ్రెస్ లో భయం పట్టుకుంది
  • దేశం లో బీజేపీ గెలుపు ఖరారు
  • ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి

దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటుచేసిన చరిత్ర బీజేపీది ఆని,అంబేడ్కర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే.. తుష్టీకరణ రాజకీయాలకోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తామని కాంగ్రెస్ చెపుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి అన్నారు. తాను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోదీ చెప్పారని,అంతకన్నా గ్యారంటీ ఇంకే కావాలి అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలు అని ఎద్దేవా చేశారు.

సికింద్రాబాద్ పార్లమెంటు ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని, కిషన్ రెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు.
పార్టీలో కిషన్ రెడ్డి గారికి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించారని, 45 ఏళ్లుగా ప్రజాజీవనంలో నిష్కళంకంగా సేవ చేస్తున్న కిషన్ రెడ్డిని మించిన సరైన అభ్యర్థి ఇంకెవరుంటారని అన్నారు.

ఎన్నికల ప్రచారం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో తాను పర్యటించానని, ఆ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం ఎవరిది ఏర్పడుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

దేశమంతా మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టమవుతుందని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి పోటీయే లేదని,ఆయన గెలుపు ఖాయమని, ఇందులో సందేహం లేదన్నారు.
మోదీ గెలుస్తారు.. కిషన్ రెడ్డి గెలుస్తారని అర్థమైందన్నారు. నేనొక్కడిని ఓటింగ్ కు పోకపోతే ఏమవుతుందనే అలసత్వం మాత్రం వద్దు అని, కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెల్లాలని, ఓటేయాలని పిలుపునిచ్చారు.

పోటీ లేదు

రాష్ట్రంలో కారు కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయిందని,కమల వికాసం కొనసాగుతోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ దామి పేర్కొన్నారు. తాము ఉత్తరాఖండ్ లో ‘ల్యాండ్ జిహాద్’పై కఠినంగా చర్యలు తీసుకున్నామని, 5వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణ నుంచి కాపాడుకున్నామని,దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలని యూసీసీని తీసుకొచ్చామన్నారు.
రాష్ట్రంలో ఏం చేయకుండా మాటలతో పాలన చేస్తున్నారని, కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా అని ప్రశ్నించారు.మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఇవ్వడం లేదు అని, యువతకు నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామన్నారు ఇచ్చారా అని నిలదీశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular