Wednesday, May 15, 2024

సాహస బాలుడిని సన్మానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ చేసిన ఈ సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా నిలుస్తాయని సిఎం కొనియాడారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బాలుడి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కలిశారు. ఈ కమ్రంలోనే ముఖ్యమంత్రి బాలుడిని సన్మానించారు. కాగా, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు.

ఈ నెల 26వ తేదీన షాద్‌నగర్ నందిగామలోని స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుండడంతో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే సాయిచరణ్ అక్కడకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ నాలుగో అంతస్తులో చిక్కుకున్న కొందరిని రక్షించాడు. అతడు చూపిన ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డిసిపి నారాయణరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ రూ. 5 వేలు రివార్డుగా ఇవ్వగా తీసుకోవడానికి బాలుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్నవారంత సాయిచరణ్‌ను మెచ్చుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular