ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
శాంతియుత పోరాటపథంలో వర్ధమాన మహావీరుని ఆధ్యాత్మిక బోధనలు ఆచరణీయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆది వారం జైనుల ఆరాధ్య దైవం వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సమాజంలో క్రమశిక్షణతో కూడిన జీవనానికి అయన బోధనలు ఎంతో దోహదపడుతాయని సిఎం అన్నారు.