రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, విజయేందిర బోయి
మహానీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, విజయేందిర బోయి అన్నారు. శనివారం తెలంగాణ సెక్రటేరియట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాల పేరుతో మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబు జగ్జీవన్రాం, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు విజయేందిర బోయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జి.ప్రశాంత్ కుమార్, రాము భూక్యా, ఎస్.కిషోర్ కుమార్, రమేష్ కుమార్, బి.సోమన్న, జి.తులసీదాస్, జె. ప్రేమ్, కె.స్వామి, కె.శ్రీనివాస రావ్, భాను కిరణ్, నర్సింగ్, రాజీవ్ చంద్, సుధీర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.