రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడిన విద్యార్థి సాయి చరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. యువకుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన కొనియాడారు.