ఢిల్లీలో ప్రతికూల వాతావరణం వల్ల శనివారం 22 విమానాలను దారి మళ్లించారు. ఇందులో ఇండిగో (9), ఎయిర్ ఇండియా (8), విస్తారా (3) విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
లక్నోకు 8, జైపూర్కు 9, చండీగఢ్కు 2, వారణాసి, అమృత్సర్, అహ్మదాబాద్ లకు ఒక్కో విమానం చొప్పున దారి మళ్లించారు. ఢిల్లీలో రోజూ 1,300 ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి..