తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఫోకస్ పెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ప్రతి నాలుగు రోజులకు ఒక అవినీతి కేసు నమోదవుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే 55 కి పైగా అవినీతి కేసులు నమోదైనట్లు చెప్పారు. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులే ఉన్నట్లు పేర్కొన్నారు.