టీఎస్, న్యూస్:ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు గురువారం రాత్రి కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది.