Thursday, May 9, 2024

ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్థి పేరు ఖ‌రారు?

ఖ‌మ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా కొత్త పేరు తెర మీదికి వ‌చ్చింది. ఖ‌మ్మం ఎంపీ సీటు కోసం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త‌మ్ముడు ప్ర‌సాద్‌రెడ్డి, మ‌రోవైపు భ‌ట్టివిక్ర‌మార్క భార్య నందిని రేసులో ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. అయితే, ఇద్ద‌రిలో ఎవ‌రికిచ్చినా స‌మ‌స్యే అని అధిష్ఠానం భావించిన‌ట్లు స‌మాచారం. అందుకే మ‌ధ్యేమార్గంగా, వ‌రంగ‌ల్ మాజీ ఎంపీ రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి కుమారుడు ఆర్ ర‌ఘురాంరెడ్డికి ఎంపీ సీటునిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపిన‌ట్లు ఢిల్లీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆర్ ర‌ఘురాంరెడ్డి మ‌రెవ‌రో కాదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి మ‌న‌వ‌డికి, పొంగులేటి త‌న కూతురినిచ్చి వివాహం చేశారు. ఆర్ ర‌ఘురామ్‌రెడ్డి మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి క్లాస్‌మేట్ కావ‌డం గ‌మ‌నార్హం.

* ఇక భువ‌న‌గిరి స్థానం నుంచి కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య‌ ల‌క్ష్మీకి టికెట్ కేటాయిస్తున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా, మెద‌క్ నుంచి నీలం మ‌ధు, వ‌రంగ‌ల్ లో ప‌సునూరి ద‌యాక‌ర్‌, నిజామాబాద్ జీవ‌న్‌రెడ్డి త‌దిత‌రుల పేర్ల‌ను ఖ‌రారు చేసింద‌ని స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular