- కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చు
- ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ
కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా చిచ్చు రేపింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు నేతలకు టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారని, కానీ, వారిని నామినేట్ చేయడం ద్వారా ప్రజల అంచనాలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నట్టయ్యిందని, ఇది కాంగ్రెస్ కేడర్ను అవమానించడమే కాకుండా వారిని నిరుత్సాహపరుస్తుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.