భక్తుల కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ టికెట్లను ఆన్లైన్ ఉంచామని అధికారులు ప్రకటించారు. 17వ తేదీన జరిగే భద్రాచలం ఉభయదాతల టిక్కెట్టుకు రూ.7,500లతో జంట కల్యాణానికి ప్రవేశంతో పాటు గోత్ర నామాలు చదువుతారని అధికారులు తెలిపారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి వస్త్రాలు, తలంబ్రాలు ఇస్తామన్నారు. ఇవే కాకండా రూ.2,000, రూ.1,000, రూ.300ల టిక్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.