కాలంచెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదు
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 15 ఏళ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని టిఎస్ ఆర్టీసి తెలిపింది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదని స్పష్టం చేసింది. పాత బస్సులను స్క్రాప్చేసి, వాటి స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ప్రతి బస్సుకు ఏటా ఆర్టీఏ ఫిట్నెస్, పొల్యూషన్ అండర్ క కంట్రోల్ టెస్టులు చేయిస్తున్నామని వివరించింది.
ఈ ఏడాది మార్చి నాటికి 466 ఆర్డినరీ బస్సులను రీప్లేస్ చేశామని వెల్లడించింది. కొత్తగా 445 మెట్రో ఎక్స్ప్రెస్, 229 ఆర్డినరీ, 125 మెట్రో డీలక్స్ల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నడుచుకుంటున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించడం లేదని ఆర్టీసి పేర్కొంది.