-
బిజెపి నేతలు డూప్ల్లికేట్ దేశ భక్తులు
-
అసలైన దేశభక్తుల కుటుంబం రాహుల్గాంధీది
-
ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతోంది
-
కాంగ్రెస్లోకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారన్నది
-
ఎన్నికల తర్వాత తెలుస్తుంది
-
అధికారంలో లేని కెసిఆర్ గేమ్ ఆడితే
-
సిఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటారా..?
-
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
బిజెపి నేతలు డూప్ల్లికేట్ దేశ భక్తులని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. దేశంలో ఎన్డిఏ ప్రాబల్యం తగ్గుతుందని, ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్లే ఇండియా గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్లోకి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేల చేరిక అంశం తన పరిధి కాదని ఆయన అన్నారు. అధికారంలో లేని కెసిఆర్ గేమ్ ఆడితే సిఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటారా..? అని ఆయన ప్రశ్నించారు. గాంధీభవన్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయ్యిందని, అప్పుడు ఉన్న పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులని ఆయన అన్నారు. బిజెపిది 40 ఏండ్ల చరిత్రని, ఈ విషయం ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.
మోతీలాల్ నెహ్రు తరం అసలైన దేశభక్తులు
బిజెపికి తామే దేశ భక్తులమని డబ్బా కొట్టుకుంటున్నారని, లేనిది ఉన్నట్టు చెప్పుకొని లబ్ది పొందే పనిలో బిజెపి ఉందని ఆయన ఆరోపించారు. అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ముత్తాత మోతీలాల్ నెహ్రు తరం నుంచే దేశభక్తుల కుటుంబమని, వాళ్లు ఒరిజినల్ దేశ భక్తులు కాబట్టే తాము దేశ భక్తులమని చెప్పుకోవడం లేదన్నారు. రాహుల్ గాంధీ ముత్తతా మోలీలాల్ నెహ్రు 1919, 1928 లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారని ఆయన తెలిపారు. ఆయనది ధనిక కుటుంబమని, మోతీలాల్ నెహ్రు సంపద అంతా స్వాతంత్ర ఉద్యమం కోసం పెట్టారని ఇది చరిత్ర అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. బిజెపి వాళ్లు తామే దేశభక్తులం అని చెప్పుకుంటున్నారని, అసలైన దేశ భక్తులు క్లెయిమ్ చేసుకోవడం లేదని ఆయన తెలిపారు.
కెసిఆర్ వ్యూహాన్ని తిపికొట్టే ఆలోచన మాకుంది
కెసిఆర్ ఏ ఆలోచనతో ప్రభుత్వం కూలిపోతుందన్నది తెలియదని, కానీ, ఆయన వ్యూహాన్ని తిప్పి కొట్టే ఆలోచన మా దగ్గర ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లు ప్రజలను ఎలా మెప్పించాలన్న ఆలోచనలో ఉన్నామని, వంద మంది ఉన్న కౌరవులను ఐదుగురు పాండవులు కూల్చేశారని,
తాము ఇక్కడ పాండవులమని ఆయన తెలిపారు. నార్త్లో బిజెపి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మూడో ప్లేస్ లో ఉన్న బిజెపి సోషల్ మీడియాలో మాత్రం బిజెపి ముందుందని ప్రచారం చేసుకుంటుందని ఆయన ఆరోపించారు.