హిందీ మిలాప్ పత్రిక ఎడిటర్ వినయ్ వీర్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పత్రికా ప్రపంచానికి తీరని లోటని సిఎం రేవంత్ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గా ఆయన హిందీ మీడియాకు అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.