Friday, May 10, 2024

ప్రీలాంచ్ పేరుతో మోసం..!

* ప్రీలాంచ్ పేరుతో మోసం..!
* ప్రజల సొమ్ముతో రియల్ దందా..?
* అపార్ట్‌మెంట్‌లు కడతాం డబ్బులు అప్పుగా ఇవ్వాలని ఓ రియల్ సంస్థ మోసం
* డబ్బులిచ్చిన వారికి ఎంఓయూ
* కూకట్‌పల్లిలో నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ సంస్థ దగా..
* హెచ్‌ఎండిఏ, రెరా అనుమతి లేకున్నా
* ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సంస్థ

మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెరా అంటే అక్కడి బిల్డర్లు భయపడతారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే ఎంత పెద్ద బిల్డర్ అయినా అక్కడి రెరా ముక్కుపిండి జరిమానాను వసూలు చేస్తుంది. కానీ, మన రాష్ట్రంలో ప్రీలాంచ్‌లు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసినా కొందరు బిల్డర్‌లు దానిని పట్టించుకోవడం లేదు. తాజాగా కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ పేరుతో ఒక ప్రీలాంచ్ బిల్డర్ సరికొత్త మోసానికి తెర లేపాడు. కొననుగోలు దారుల నుంచి అప్పు కింద ఫ్లాటుకు అయ్యే సొమ్మును బిల్డర్ తీసుకుంటున్నాడు. రెండేళ్ల తర్వాత ఆరు శాతం వడ్డీ చొప్పున కొనుగోలు దారుడికి వెనక్కి ఇచ్చేస్తానని, ఒకవేళ, కొనుగోలుదారుడు ఆ సొమ్మును వద్దంటే అదే సొమ్ముకు తగ్గ ఫ్లాటును రాసిస్తానని నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ యాజమాన్యం బయ్యర్లకు ఎంఓయూ రాసిస్తోంది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ సంస్థకు హెచ్‌ఎండిఏ అనుమతి లేదు. రెరా పర్మిషన్ లేదు. అయినా, బయ్యర్ల నుంచి వంద శాతం సొమ్మును వసూలు చేయడానికి నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ సంస్థ ఆసక్తి చూపుతోంది. చదరపు అడుగుకు రూ.4,700లనే ఈ సంస్థ పేర్కొంటుంది. కేవలం స్థలం కొనడానికే ఇలా ప్రజల నుంచి ఈ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేస్తే ఆకాశహర్మ్యాలను ఎలా కడతాడరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రూ.2500 కోట్ల వసూలు?

నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ అనే ప్రాజెక్టును కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద సర్వే నెంబర్ 10, 11లో 19.12 ఎకరాల్లో నిర్మిస్తానని ప్రజలను మభ్యపెడుతోంది. ఇందులో మొత్తం పధ్నాలుగు టవర్లతో పాటు ఇరవై వేల ఫ్లాట్లను నిర్మిస్తామని పేర్కొంటుంది. దీనికోసం అందమైన బ్రోచర్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఫ్రీలాంచ్‌ను ప్రారంభించిన ఈ సంస్థ సుమారు రెండువేల ఐదు వందల కోట్లను వసూలు చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్..?

నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ ప్రీలాంచ్ ప్రకటన చూసి కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు రియల్ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒక మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్‌ను బయ్యర్లకు పంపించారు. అందులో ఆ సంస్థ యజమాని ఈ అవగాహన పత్రం మీద సంతకం పెడుతున్నారు. ఫ్రీలాంచ్‌లో ప్లాట్‌లను కొనేవారు సదరు యజమానికి అప్పు కింద సొమ్ము ఇస్తున్నాడని ఈ ఎంఓయూలో రాసుకుంటున్నారు. ఇలా సొమ్ము ఇచ్చినందుకు గాను రెండు సంవత్సరాల తర్వాత సదరు బిల్డర్ ఆయా మొత్తం మీద ఆరు శాతం వడ్డీతో సొమ్మును వెనక్కి ఇచ్చేస్తాడని అందులో రాసి ఉంది. లే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular