Thursday, May 9, 2024

పుష్పక్ బస్సుల సమయంలో స్వల్పమార్పులు

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ బస్సుల సమయంలో ఆర్టీసి స్వల్పమార్పులను చేసింది. పుష్పక్ పేరుతో ప్రతి 15 నిమిషాలకు ఒక ఎసి బస్సును ఎయిర్ పోర్టుకు ఆర్టీసి నడుపుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ అనేక ప్రదేశాల్లో ప్రయాణికులను ఎయిర్‌పోర్టుకు చేర్చుతున్నాయి. అయితే ఈ బస్సులను నడిపే రూట్‌లలో ఆర్టీసి స్వల్ప మార్పులు చేసింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్లే మార్గంలో స్వల్ప మార్పులు చేసింది.

మెహిదీపట్నం నుంచి పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులను ఫ్లైవర్ కింద రోడ్డుపై నుంచి మళ్లీంచింది. శుక్రవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆర్టీసి ఉన్నతాధికారులు తెలిపారు. 49 పుష్పక్ ఎసి బస్సులను నాలుగు రూట్లలో 24 గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసి నడుపుతోంది. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికోసం నెలవారి బస్ పాసులను కూడా అందిస్తోంది. మియాపూర్ ఎక్స్ రోడ్డు, జేబిఎస్, సికింద్రాబాద్ నుంచి పుష్పక్ ఎసి బస్సులను ఆర్టీసి నడుపుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular