Monday, May 6, 2024

ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్ షాలకు ఉందా?

  • ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్ షాలకు ఉందా?
  • సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినందునే కెసిఆర్ సిఎం అయ్యారు…
  • రాహుల్ గాంధీ కుటుంబాన్ని బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు నిందిస్తున్నారు
  • మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్ షాలకు ఉందా? అని మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ దేశానికి అన్ని చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు నిందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినందునే కెసిఆర్ సిఎం అయ్యారు, కెసిఆర్ కుటుంబం అంతా సెట్ అయ్యిందని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఏం చేసింది అనేది ఊత పదం అయ్యిందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రానికి కెసిఆర్ సిఎం అయ్యేవాడా..? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ప్రధానిగా ఉండి దేశంలోని ఉమ్మడి రాష్ట్రంలో ని దళితులకు ప్రభుత్వ భూములను పంచి పెట్టారని ఆయన తెలిపారు.

బిజెపి నేతలకు ఈ చరిత్ర ఉందా..?

బిజెపి నేతలకు ఈ చరిత్ర ఉందా..? ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్ షాలకు ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అమిత్ షా జైలుకు ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసన్నారు. కెసిఆర్ జైల్లో ఒక్క రోజు కూడా ఉండలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కరోజుకే కాళ్లు చేతులు కొట్టుకున్నారన్నారు. దళితులకు, గిరిజనులకు భూములు పంచిన చరిత్ర ఇందిరమ్మదన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇచ్చిన భూముల పైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆయన తెలిపారు. మోడీ కానీ, కెసిఆర్ కానీ, ఒక్క ఇంచు భూమి అయినా ఇచ్చారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలనలో బ్యాంకులను జాతీయం చేశారని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ప్రతి ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే ఇందిరమ్మ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. రోటీ.. కపడా.. మకాన్.. నినాదంతో ప్రతి పేద ఇంటికి ఇందిరమ్మ పేరు వెళ్లిందన్నారు.

ఇందిరమ్మ చరిత్ర యువత తెలుసుకోవాలి

బిహెచ్‌ఈఎల్, ఐడిపిఎల్, హెచ్‌ఏఎల్, హెచ్‌ఎంటీ, బిడిఎల్, హెచ్‌సిఎల్, సిఎస్‌ఐఆర్, ఈసిఐఎల్, డిఆర్డీఎల్, లాంటి సంస్థలు పెట్టింది ఇందిరమ్మ అని ఆయన అన్నారు. ఇప్పుడున్న యువత ఈ చరిత్ర తెలుకోవాలన్నారు. ఇందిరమ్మ పరిశ్రమలు పెడితే.. మోడీ మూసేస్తున్నాడని జగ్గారెడ్డి మండిపడ్డారు. పేదలు బతకాలని సంజీవిని లాంటి పరిశ్రమలు ఇందిరమ్మ పెడితే మోడీ అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేశారని, జనంది కూడా తప్పేనని, ఇవన్నీ ప్రశ్నించక పోవడం జనం తప్పే నన్నారు. పాకిస్థాన్ తో ఇందిరమ్మ యుద్ధం చేసి గెలిచారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. పుల్వామా లో దాడి చేస్తే మోడీ నిద్రలో ఉన్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజ్‌పాయ్, ఇందిరమ్మను అపర కాళీ అన్నారని, నిబద్ధత కలిగిన నాయకుడు వాజ్‌పాయ్ అని ఆయన అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular