ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈనెల 25వ తేదీన ఉప్పల్ మైదానంలో ఐపిఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ రోజున రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. రాత్రి 12:15 గంటలకు చివరి రైలు ప్రారంభమై రాత్రి 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఉప్పల్ స్టేడియం – ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో రైలు దిగే వారికే అనుమతి ఉంటుందని ఎక్కడానికి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు.