న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టి వేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది.
ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో.. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా, శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.