టీఎస్, న్యూస్: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్రనగర్లో ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పీవీఆర్ ఎక్స్ప్రెస్హైవేపై పిల్లర్నెంబర్ 144 దగ్గర ఓ వ్యక్తికి అకస్మాత్తుగా చెస్ట్ పెయిన్ రావడం, పెయిన్ తట్టుకోలేక గిలగిల్లాడుతుండటంతో.. తన కాన్వాయ్ లో ఉండే అంబులెన్స్ పంపి సదరు వ్యక్తి ప్రాణం కాపాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.