ఎస్ఎంఆర్సి వినయ్ సిటీలో జరిగిన ఫ్రెండ్స్ వాలీబాల్ టోర్నమెంట్ సీజన్ -3 విజేతగా టీమ్ వైపర్స్ నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో టీమ్ వైపర్స్ జట్టు సమీప ప్రత్యర్థి అయిన స్పైక్ ప్యాంథర్స్ జట్టుపై 21-19, 20-21, 21-13 తేడాతో గెలిచింది. ఏప్రిల్ 6వ తేదీన ఆరంభమైన 3వ సీజన్లో మొత్తం 48 మంది క్రీడాకారులు ఆరు జట్లుగా పోటీపడ్డారు. సీజన్ 3లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా చంద్రమోహన్ నిలిచారు.
రూబెన్, దేబ్జీత్, వంశీలు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింగ్ జాన్సన్ కొయ్యడ విజేతలకు ట్రోఫీని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాలీబాల్ సీజన్ 3 టోర్నమెంట్ కొణిదెల అరుణ్, ఏవిఎస్, ముత్తు ఎస్, దేబ్జీత్ నేగీలు స్పాన్సర్గా వ్యవహారించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీజన్ 3 టోర్నమెంట్కు తాతాజీ నాయుడు, సురేష్, రూబెన్, ఆర్ముగం, వేదా, విమల్ , రవి తదితరులు ఆర్గనైజర్లుగా వ్యవహారించారు.