Sunday, April 28, 2024

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు..

టీఎస్ న్యూస్‌ న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం,(ఫెమా) నిబం ధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్త దర్శన్‌ హీరానందానికి కూడా సమన్లు పంపింది. కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరు కాలేదు. ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదా లు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడో సారి ఆమెకు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular